ఫ్యాన్స్ కు రేపే అపాయింట్‌మెంట్…ఫిక్స్ చేసిన మహేష్ !

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు తన అభిమానులకు గిప్ట్ ఇవ్వబోతున్నారు. మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహర్షి’.మహేష్ బాబు‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాలోని రెండో పోస్టర్‌ని డిసెంబర్ 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించాడు. ‘‘31 డిసెంబర్ సాయంత్రం 6.03 గంటలకు రిషితో మీ అపాయింట్‌మెంట్. ఈ న్యూ ఇయర్‌ని రిషి, అతని ప్రయాణంతో సెలబ్రేట్ చేసుకోండి’’ అంటూ వంశీ ట్వీట్ చేశాడు.

వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై ఈ సినిమాను అశ్విని దత్, దిల్ రాజు, ప్రసాద్ వీ.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే మహేశ్ సరసన నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్టు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం…. ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్‌లో భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్‌తో ‘మహర్షి’ టాకీ పూర్తవుతుంది. మహేశ్ బాబు స్టూడెంట్‌గా, ఎన్‌ఆర్ఐగా.. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రైతు సీన్స్ కూడా హైలైట్‌గా ఉంటాయట.