ఇంట్రస్టింగ్ ట్రైలర్ ,విజువల్స్ అదుర్స్

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలుగా వస్తున్న చిత్రం -47 డేస్. ది మిస్టరీ ఆన్ ఫోల్డ్స్ అనే ట్యాగ్ లైన్. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రాన్ని టైటిల్ కార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ట్రైలర్‌ రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

#47DAYS Movie Trailer 4k || #Satyadev || #RaghuKunche

 ‘నా పేరు సత్యం.. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘నా గతాన్ని వెలికితీసి నా ప్రస్తుతాన్ని వెంటాడుతోంది. ఆమెను వెతకడానికి వెళ్తున్నా..’ అంటూ ఇంట్రస్టింగ్ గా ట్రైలర్‌ సాగింది.  మిస్టరీ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.  

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ… కంటెంట్‌ని నమ్ముకున్న సినిమాలంటే నాకు ఇష్టం. ప్రదీప్ ఈ సినిమాను ఎంతచక్కగా చేసి ఉంటాడో ట్రైలర్‌ను బట్టి చెప్పొచ్చు అన్నారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ… నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. సినిమా ట్రైలర్ రఫ్ కట్ చూసిన రాంగోపాల్‌వర్మ విజువల్స్‌తో స్టోరీ చెప్పారని వ్యాఖ్యానించారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్. సత్య నాకిచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.