దర్శకుడు ఈవీవీకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ అంకితం

నవతరం హాస్యానికి పట్టం కట్టిన దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణకు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరి మట్ట చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిన సంపూర్ణేష్ బాబు ఇందులో త్రిపాత్రాభిన‌యంలో కనిపించనున్నారు.

హృద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని రూపొందించారు. రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు.

సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నాన్ స్టాప్ ట్రైలర్ పై వస్తున్న కామెంట్స్, స్పందన అద్భుతంగా ఉందని చిత్రం యూనిట్ చెబుతోంది.

120 నిమిషాల ఈ చిత్రం లో యాక్ష‌న్‌, కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమోష‌న్‌, ప్రేమ అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌. అందుకే ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు ఇవివి గారికి అంకితం ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా అమృత ప్రొడక్షన్స్ విడుదల చేసిన ప్రకటన ఇది.