రామ్ చరణ్ కి రిక్వెస్ట్ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు

తమిళ,తెలుగు భాషల్లో దుమ్ము రేపుతున్న హీరోయిన్ ఎవరూ అంటే నయనతార అని చెప్పాలి. పూర్తి స్దాయి బిజీ షెడ్యూల్స్ లో ఆమె తను నటించిన సినిమాకు ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. అది చాలా మంది నిర్మాతలకు,హీరోలకు బాధ కలిగించినా ఆమె లైట్ తీసుకుంటుంది. మరీ ఎక్కువ ఒత్తిడి పెడితే తమిళ సినిమాల ప్రమోషన్స్ కు ఒకటి రెండు రోజులు కేటాయిస్తుంది. తెలుగు సినిమాలు అయితే అదీ లేదు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ తను నిర్మిస్తున్న సైరా చిత్రానికి కూడా ఇదే సమస్య ఎదురౌతుందని భావించి రీసెంట్ గా ఆమెను రిక్వెస్ట్ చేసారట.

తన తండ్రి హీరోగా చేస్తున్న సైరా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె ను అడిగాడట రామ్ చరణ్. అందుకు నయనతార మొదట కష్టం, ఆ టైమ్ కు వేరే షూటింగ్ లో ఉంటాను అంటూ తప్పించుకోబోయిందిట.

కానీ ఇది చారిత్రక చిత్రం అని, ప్రమోషన్స్ చాలా అవసరం అని, చాలా బడ్జెట్ పెట్టి చేస్తున్న సినిమా అని హీరోయిన్ సినిమా ఫంక్ష‌న్ల‌కు, ఇంట‌ర్వ్యూలకు రాక‌పోతే ఇబ్బంది ఎదుర‌వుతుందని చెప్పి రామ్ చరణ్ రిక్వెస్ట్ చేసే సరికి సానుకూలంగా స్పందించిందని సమాచారం. దాంతో నయనతార సైరా ప్రమోషన్స్ కు వస్తుందని ఆమె అభిమానులే కాక డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఖుషీగా ఉన్నారు.

ఇక ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సైరా చిత్రం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , విజయ్ సేతుపతి , సుధీప్ , తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.