`RX100` డైరెక్ట‌ర్‌కి షాకిచ్చిన స‌మంత‌!

`RX100` సినిమాతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించారు అజ‌య్ భూప‌తి. రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీతో తొలి సినియాతోనే సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం తెర‌పైకి తీసుకురావ‌డానికి ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఆప‌సోపాలు ప‌డుతున్నారు. 2018 జైలైలో
`RX100` చిత్రం విడుద‌లైంది. అప్ప‌టి నుంచి కొత్త సినిమా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నాడు. అయినా ఏవీ ఫ‌లించ‌డం లేదు. మ‌ల్టీస్టార‌ర్ చిత్రం కావ‌డంతో ఆ చిత్రానికి ఎవ‌రూ సెట్ కావ‌డం తేదు.

ర‌వితేజ‌, నాగ‌చైత‌న్య‌.. ఇలా అంద‌రి ద‌గ్గ‌రికి తిరిగి చివ‌రికి శ‌ర్వానంద్ ద‌గ్గ‌రికి వ‌చ్చింది. శ‌ర్వా ఓకే చెప్పేశాడు. మ‌రో హీరో కోసం అన్వేష‌ణ మొద‌లైంది. `మ‌హాస‌ముద్రం` పేరుని ఇప్ప‌టికే ఫైన‌ల్ చేసేశాడు అజ‌య్ భూప‌తి. శ‌ర్వాకు జోడీగా స‌మంత‌ను అనుకున్నారు. టాక్స్ కూడా పూర్త‌య్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి స‌మంత త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వాతో క‌లిసి స‌మంత `జాను` చిత్రంలో న‌టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో శ‌ర్వాతో క‌లిసి మ‌రోసారి క‌లిసి రిస్క్ చేయ‌డానికి ఇష్టం లేని స‌మంత ఈ సినిమా నుంచి త‌ప్పుకుని అజ‌య్ భూప‌తికి షాకిచ్చింద‌ట‌.

దీంతో అజ‌య్ భూప‌తి ఏక్ష‌ణాన ఈ ప్రాజెక్ట్ అనుకున్నాడో కానీ `మ‌హాస‌ముద్రం` సెట్స్‌పైకి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేద‌ని. ఆ స్క్రిప్ట్‌ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌తో ప్ర‌య‌త్నాలు చేస్తే మంచిద‌ని, ఇంకా ఆల‌స్యం చేస్తే `RX100` క్రేజ్ కాస్తా త‌గ్గి అజ‌య్‌కి సినిమా ఇవ్వ‌డానికి హీరోలు, నిర్మాత‌లు వెన‌క‌డుగువేసే ప్ర‌మాదం వుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నారు.