వర్మ…మహేష్ కి బిస్కట్స్ వేస్తున్నాడేంటి?

రామ్ గోపాల్ వర్మ స్కూల్ మొదటి నుంచి తనకు కావాలనుకున్న వారికి అనుకూలంగా ట్వీట్స్ చేయటం. మీడియాలో మాట్లాడటం…వారికి ఫ్రీగా పబ్లిసిటీ చేయటం. అయితే అందులోనూ ఆయన తన స్వార్దం చూసుకుంటారు. ఇప్పుడు వర్మ ..తాజాగా మహేష్ బాబు నిర్మించిన థియోటర్స్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన థియేటర్ ‘ఏఎంబీ’ సినిమాస్‌ని ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ థియేటర్‌లో తొలి సినిమాగా సూపర్ స్టార్ రజనీ నటించిన ‘2.0’ను ప్రదర్శిస్తున్నారు. ఏఎంబీలో మొత్తం 7 స్క్రీన్లు ఉన్నాయి. బెడ్ సీట్స్‌తో సరికొత్తగా నిర్మించిన ఇలాంటి థియేటర్‌ను నిర్మించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం. ఈ మల్టీప్లెక్స్‌ను ప్రశంసిస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పటికే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.


తాజాగా ఆయన ఇది థియేటర్‌లో ఓ సమస్య ఉందంటూ మరో ట్వీట్ చేశారు. ‘‘మహేష్ నిర్మించిన ‘ఏఎంబీ’ సినిమాస్‌‌లో సినిమా చూశాను. ఈ సూపర్‌ప్లెక్స్ థియేటర్‌లో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే.. ఈ అద్భుతమైన థియేటర్‌కు సరిపడే స్థాయి ఉన్న సినిమా రావడం చాలా కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్’’ అని ట్వీట్‌ చేసారు.

అయితే ఈ వరస ట్వీట్స్ చూసిన వారికి మహేష్ బాబుకి బిస్కట్ వేస్తున్నాడా ఏమటి ..అని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్దితిల్లో మహేష్ ఎలాగో వర్మ కు డేట్స్ ఇవ్వరనేది నిజం. మరి దేనికి..ఆయన చిత్రం భైరవ గీత ను ఆ మల్టిఫ్లెక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారా అని కొంతమంది అంటున్నారు. అయితే మల్టిఫ్లెక్స్ లో రిలీజ్ చేసే సినిమాల విషయంలో మహేష్ నిర్ణయం తీసుకోరనేది నిజం. ప్రయారిటీని బట్టి షోలు వేస్తూంటారు. కాబట్టి నిజంగానే వర్మ ఈ థియోటర్స్ చూసి మోజు పడి ఇలా ట్వీట్స్ చేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.