పందిపిల్లతో ‘పాదయాత్ర’…వెటకారమా? రవిబాబు పై విమర్శలు

దర్శకుడుగా రవిబాబు తెరపై ఎంత క్రియేటివిటీ చూపెడతారో…తన చిత్రం ప్రమోషన్ విషయంలో అదే విధంగా కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే ఆ కొత్త కాన్సెప్టులు వికటించకుండా ఉంటే అందరికీ ఆమోదయోగ్యం అవుతాయి. లేకపోతే ఆయనదారి..ప్రపంచందో దారి అవుతుంది. తాజాగా ఆయన పందిపిల్ల ప్రధాన పాత్రలో పెట్టి“అదిగో”అనే చిత్రం ప్లాన్ చేసారు. ఈ మధ్యకాలంలో విభిన్న చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన సురేష్ బాబు నిర్మించటం ప్లస్ అయ్యింది. “అదిగో” పై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.

దానికి తోడు ఇంతవరకు టాలీవుడ్ లో అటువంటి నేపథ్యంలో సినిమా రాకపోవడంతో ….ఇండస్ట్రీలో కూడా ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంది. సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో రవిబాబు కూడా….ఈ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ చేశాడు.

సినిమా కోసం రవిబాబు ఒక పందిపిల్లను పెంచుకొని దానితోనే షూటింగ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ పంది పిల్లతో పాదయాత్ర అంటూ ఓ పోస్టర్ వదిలాడు. కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ఈ రోజు సాయంత్రం 3గంటల 30నిమిషాలకు పాదయాత్ర మొదలు కానుందని ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ పాదయాత్ర అనే పదమే చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం రాజకీయాల్లో పాదయాత్ర అనేది చాలా పెద్ద విషయం. గత కొంతకాలంగా వైయస్ జగన్ పాద యాత్ర చేస్తున్నారు. గతంలో వైయస్ సైతం పాద యాత్ర చేసారు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే టైటిల్ తో సినిమాకూడా వస్తోంది. దాంతో ఈ పందిపిల్లతో పాదయాత్ర అనేది కొందరిని ఖచ్చితంగా ఇబ్బందిపెట్టినట్లే, వారి మనోభావాలు దెబ్బ తీసినట్లే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. కావాలని కాంట్రవర్సి క్రియోట్ చేయాలనకుంటే ఓకే ..అలా కాకుండా…కేవలం పబ్లిసిటీ కోసం ఇలా కెలుక్కుంటే మాత్రం ఇబ్బందే.

పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
ప్రశాంత్ విహారి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రవిబాబు నిర్మించిన ఈ సినిమా ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమా మ్యాగ్జిమం అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుండటం విశేషం. సురేష్ బాబు ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.

వాస్తవానికి గత ఏడాదే `అదిగో` విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ రీజన్స్ వల్ల దాని విడుదలలో జాప్యం జరిగింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం…ఎట్టకేలకు సెప్టెంబర్ లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకం’పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి రవిబాబు మచ్ అవెయిటెడ్ మూవీ`అదిగో` తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.