రానా-తేజ మ‌ళ్లీ ఓ పొలిటిక‌ల్ డ్రామా?

ద‌గ్గుబాటి రానా- తేజ మళ్లీ చేతులు క‌లుపుతున్నారా? మ‌రో సెటైరిక‌ల్ పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన నేనే రాజు నేనే మంత్రి చ‌క్క‌ని విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంలందుకుంది. తేజ‌లో కొత్త యాంగిల్ ని ప‌రిచ‌యం చేసిన సినిమా. అత‌ను ఇలాంటి సినిమాలు కూడా తీయ‌గ‌ల‌డా? అని తేజ‌లో న్యూ ట్యాలెంట్ ని చాటి చెప్పిన చిత్ర‌మిది.

ఆ విజ‌యం త‌ర్వాత తేజ కు వెంట‌నే బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత సినిమాకు ప‌నిచేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా ఇద్ద‌రికీ ఓ చేదు జ్ఞాప‌కంగా మిగిలిపోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌మైన ఫ‌లితాన్ని సాధించింది. దీంతో తేజ‌కు మ‌రో అవ‌కాశం దూర‌మైంది. దీంతో తాజాగా మ‌రోసారి తేజ‌కు లిప్ట్ ఇవ్వ‌డానికి రానా ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్దరు మ‌రోసారి పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ తో మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారుట‌. ఈ చిత్రానికి రాక్ష‌స రాజ్యంలో రావ‌ణాసురుడు అనేది టైటిల్ అని స‌మాచారం.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని..ఫైనల్ కాలేద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం రానా వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వంలో న‌టిస్తున్నాడు. 1940 నేప‌థ్యంలో సాగే న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ల‌ర్లు ఆద్యంతం ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. లైట్ గా తెలంగాణ సాయుధ పోరాటం ట‌చ్ అప్ కూడా ఉంటుందిట‌. ఇందులో రానాకి జోడీగా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత తేజ ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది