‘ఇస్మార్ట్‌ శంకర్‌’ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. పూరి, చార్మిలు నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందనే విషయమై ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కలు ఇవీ.

మొదట్లో పూరి, ఛార్మి చెప్పిన రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ వెనకాడినా, టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి స్పందనరావటంతో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరిగింది. ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం ఇస్మార్ట్ శంకర్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

సినిమా నైజాం హక్కులు రూ. 7 కోట్ల 20 లక్షలకు ఆంధ్రా హక్కులు రూ. 6 కోట్ల 50 లక్షలకు సీడెడ్‌ రూ. 3 కోట్ల 33 లక్షలకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

అలాగే ఇతర రాష్ట్రాలలోనూ ఇస్మార్ట్ శంకర్‌కు మంచి బిజినెస్‌ జరుగుతోంది. ఈ సినిమా కర్ణాటక హక్కులు రూ. కోటి యాబై లక్షలకు అమ్ముడు కాగా మిగతా రాష్ట్రాలన్ని కలిపి రూ. 65 లక్షలు పలికాయి. ఇవి కాక డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు అన్ని కలిపి దాదాపు రూ. 17 కోట్ల వరకు పలికాయి. దీంతో ఇస్మార్ట్ శంకర్‌ రిలీజ్‌కు ముందే దాదాపు రూ 36 కోట్ల 18 లక్షల బిజినెస్‌ చేసినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.