మళ్లీ బాలయ్యతోనా, భయపడుతున్న రకుల్!?

సీనియర్ హీరోలకు ..డైరక్టర్స్ ,నిర్మాతలు దొరుకుతున్నా హీరోయిన్స్ కరువు మాత్రం వెంటాడుతోంది. యంగ్ హీరోలతో చేసే స్టార్ హీరోయిన్స్ వీళ్లతో చేయరు. అలాగని కొత్త హీరోయిన్స్ తీసుకువద్దామంటే బిజినెస్ యాంగిల్ దృష్ట్యా సమస్య. ఈ నేపధ్యంలో తమ పరిచాయాలతో తమకు కాదనే వాళ్ల కోసం అన్వేషిస్తున్నారు.

అదే పద్దతిలో బాలయ్య దృష్టి ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ పై పడింది. ఆ మధ్యన వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి గా తన సరసన నటించిన ఆమెను మరోసారి రిపీట్ చెయ్యాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమె ను దర్శకుడు కె.ఎస్ రవికుమార్ సైతం ఎప్రోచ్ అయ్యినట్లు తెలుస్తోంది. రకుల్ సైతం వరసగా నాగార్జున, బాలయ్య ఇలా సీనియర్ హీరోలతో చేస్తే తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందేమో..యంగ్ హీరోలు తనను ప్రక్కన పెట్టేస్తారేమో అని భయపడుతోందిట.

బాలయ్య తన నెక్ట్స్ చిత్రానికి రెడీ అవుతున్నారు. అయితే బోయపాటితో చెయ్యటం లేదు. సింహా, లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడోసారి బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. అయితే బాలకృష్ణ, బోయపాటికి సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు. బాలయ్య నెక్స్ట్ సినిమా కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రానున్నట్లు తెలిసింది. అంతేకాదు మేలో సినిమాకి కొబ్బరికాయ కొట్టి జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు.

మరో ప్రక్క మొన్నటి వరకు బోయపాటి సినిమాకి ఫిక్సయిన బాలయ్య సడెన్ గా కె.ఎస్ రవికుమార్ కి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు స్క్రిప్ట్ విషయంలో బోయపాటి బాలకృష్ణని సంతృప్తి పర్చకపోవడంతోనే పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కెఎస్ రవికుమార్ పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉండటం ఆల్రెడీ జై సింహా సినిమాతో హిట్టివ్వడంతో బాలయ్య అటువైపు మొగ్గుచూపాడు.