రాశి ఖన్నా ‘ఒకే’ అంటే లావణ్య ‘నో’ చెప్పిందట!

Lavanya Tripathi
ఇప్పుడు అన్ని భాషల్లోనూ  డిజిటల్‌ హవా సాగుతోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో డిజిటల్‌ రంగానికి వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ రంగంవైపు మొగ్గుచూపుతున్నాయి.
 
Raasi Khanna
Raasi Khanna
స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం నటించేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. సౌత్‌లో టాప్‌ హీరోయిన్ లు  అయిన సమంత, కాజల్‌ అగర్వాల్, తమన్నా,  త్రిష వంటి వారు సైతం డిజిటల్‌ రంగంవైపు అడుగులేశారు.
 
తాజాగా మరో స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా  కూడా డిజిటల్‌ ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. రామ్‌ సుబ్రమణ్యన్‌ దర్శకత్వం వహించనున్నతమిళ, తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు రాశీఖన్నా అంగీకరించారట. తండ్రీ, కూతురు మధ్య జరిగే భావోద్వేగమైన కథతో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుందని తెలిసింది. 
 

‘లిక్కర్‌ బ్రాండ్‌’ ప్రకటనలకు లావణ్యని ‘నో’ చెప్పేసింది!

”ఆ విషయంలో నా మనసు మారదు. కుదరదంటే కుదరదు” అంటోంది  లావణ్యా త్రిపాఠి. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ ఇంత పట్టుదలగా ఉన్నారంటే… కొన్ని ఉత్పత్తులను ప్రచారం చేసే విషయంలో. వాణిజ్య ప్రకటనలంటే మంచి చెక్‌ అందుతుంది.
 
Lavanya Tripathi
Lavanya Tripathi
మరి.. భారీ పారితోషికం అందించే ఆ చెక్‌ని లావణ్య ఎందుకు కాదనుకుంటున్నారంటే అవి ‘లిక్కర్‌ బ్రాండ్‌’కి సంబంధించిన ప్రకటనలు కాబట్టి. ఆరోగ్యానికి హాని కలిగించేవాటిని ప్రమోట్‌ చేయడం కుదరదని చెప్పేసిందట.  ఇటీవల కొన్ని ప్రముఖ లిక్కర్‌ బ్రాండ్‌లు లావణ్యని సంప్రదిస్తే ‘నో’ చెప్పేసిందని ఆమె సన్నిహితులు చెప్పారు.
 
ఇక సినిమాల విషయానికొస్తే.. సందీప్‌ కిషన్‌ సరసన ‘ఏ1 ఎక్సు ‌ప్రెస్‌’ చేస్తోంది. ఇందులో లావణ్య హాకీ ప్లేయర్‌. ఈ సినిమా కోసం హాకీ నేర్చుకుంది.  అలాగే కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలోనటిస్తోంది. తమిళంలో అథర్వకు జోడీగా ఓ సినిమా చేస్తోంది.