కెరీర్లో ఎప్పటికైనా రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించాలన్నది తన డ్రీమ్ అని అంటోంది అందాలతార ప్రగ్యా జైశ్వాల్.
‘కంచె’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రగ్యా ఆ తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్ష్రతం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రగ్యా సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సుత్తి లేకుండా సూటిగా ఆన్సర్లు ఇచ్చి జోషి నింపింది.
క్వారంటైన్ కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది. టాలీవుడ్ నా ఇల్లులాంటిది. తెలుగులో ఎందుకు నటించడం లేదు అడిగితే.. సరైన స్క్రిప్ట్ రాలేదు. నేనూ మీలాగే ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది.
రాజమౌళి, సంజయ్లీలా భన్సాలీ చిత్రాల్లో నటించాలని ఉంది. ఏది నా డ్రీమ్. కెరీర్లో ఒక్క ఛాన్సు వస్తే చాలు రెచ్చిపోతానంటోంది. నచ్చిన హీరో గురించి చెప్పమంటే.. నాగార్జున అని ఠకీమని చెప్పేసింది. అంతేకాదు.. ఆయన గొప్ప నటుడే కాదు అరుదైన వ్యక్తి కూడా. నా హీరో అతడే అంటూ చకచకా చెప్పేసింది.