నయనతార సినిమా రిలీజ్ ఆపమని హైకోర్టు

ప్రముఖ హీరోయిన్ , లేటీ సూపర్ స్టార్ నయనతార కొత్త సినిమా ‘కోలైయుతీర్ కలాం’ చిక్కుల్లో పడింది. జూన్‌ 14న రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు ‘బిల్లా 2’ ఫేం చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది..

ప్రముఖ తమిళ రచయిత సుజాతా రంగరాజన్ కోలైయుతీర్ కలాం నవల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలిసింది. ఈ నవల రైట్స్‌ను రూ.10 లక్షలు పెట్టి సుజాతా రంగరాజన్ భార్య నుండి తాను కొనుగోలు చేసానని, ఇది కాపీ రైట్స్‌ను ఉల్లంఘించడమని, నిర్మాతలు సినిమాను విడుదల చెయ్యకుండా చూడాలని దర్శకుడు బాలాజీ కుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసారు.

మంగళవారం బాలాజీ కుమార్ పిటిషన్‌‌ను పరిశీలించిన కోర్టు కోలైయుతీర్ కలాం సినిమా విడుదలపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.. జూన్ 21న చిత్ర నిర్మాతలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.. ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి తదితరులు నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.