నిజమేనంటూ నాని అఫీషియల్ ప్రకటన

నాచురల్ స్టార్ నాని త్వరలో ‘మనం ,24’ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమా రూమరా అనేది చాలా మందికి అర్దం కాలేదు. అయితే అదేమీ రూమర్ కాదనీ అఫీషియల్ గా ప్రకటించేసాడు నాని.

చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను చాలా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఓ పిట్టగోడ మీద నాని, విక్రమ్‌లో టీ తాగుతున్న చర్చించుకుంటున్న ఫొటోను ‘నేను, విక్రమ్‌ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే సంవత్సరంలో.. అమ్మాయిలు ఇది మీ కోసమే’ అనే కామెంట్‌తో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఈచిత్రంసెట్స్ మీదకు వెళ్లనుంది. తర్వలోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

నాని ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ఈ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే తన 24 వచిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.