బాలకృష్ణ కి ఆడ విలన్ ?

జై సింహా కాంబో బాల‌కృష్ణ‌, కేఎస్ ర‌వికుమార్ త్వ‌ర‌లో రూల‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా, త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ద‌మైంది. సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌.

ఇక విల‌న్‌గా త‌మిళ భామ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని తీసుకోవాల‌ని ప్రొడ్యూసర్స్ భావించిననప్పటికి, అది వ‌ర్కవుట్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం న‌మిత లేడీ విల‌న్‌ గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. ఈ వార్తే క‌నుక నిజ‌మైతే సింహా త‌ర్వాత బాల‌య్య‌, న‌మిత క‌లిసి న‌టించిన మ‌రో చిత్రం అవుతుంది. న‌మిత 2017లో తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా వీరేంద్రని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు త‌మిళంలో ప‌లు క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది.ఈ సినిమా ఏంటీ అనేది తెలియాలిసిఉంది.