రెమ్యూనరేషన్ పెంచేసిన ఇస్మార్ట్ పోరి ?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కన్నడ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్నని పచ్చి నిజం .. ఇంతవరకు ఒక్కో సమయంలో ఒక్కో బాషా హీరోయిన్లు టాలీవుడ్ లో ఆధిపత్యం చెలాయించేవారు .. నాటి కాలంలో తెలుగు హీరోయిన్లకే ఎక్కువ ఛాన్సులు ఉండేవి .. కానీ గ్లామర్ విషయంలో ఓ అడుగు ముందుకేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాలీవూడ్ భామలకు తెలుగు హీరోయిన్లు పోటీగా నిలబడలేక ఓడిపోయారు.. దాంతో సినిమాల్లో నటనే కాదు గ్లామర్ ముఖ్య భూమికను పోషించడంతో .. బాలీవూడ్ భామలకు ఎక్కువ క్రేజ్ దక్కింది .. దాంతో బాలీవుడ్ నుండి పలువురు భామలను దిగుమతి చేసుకున్నారు .. ఆ తరువాత వాళ్ళు బోర్ కొట్టారేమో .. వెంటనే మలయాళ భామలకోసం ఎగబడ్డారు .. వీరికి గ్లామర్, నటన సాంబార్ తో  విద్య. ఇప్పుడు వాళ్ళు బోర్ కొట్టారు కాబట్టి .. కన్నడ హీరోయిన్స్ కు క్రేజ్ పెరిగింది.

చలో సినిమాతో కన్నడ భామ రష్మిక మందన్న నుండి ఈ దిగుమతి ఎక్కువైంది. ఆ కోవలోనే ఎంట్రీ ఇచ్చింది మరో కన్నడ భామ నాభ నటేష్. సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది .. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ రాణి సక్సెస్, క్రేజ్ ఒక్క ఇస్మార్ట్ శంకర్ తో దక్కించుకుంది. ఇస్మార్ట్ హిట్ తో నాభ రేంజ్ పెరగడంతో ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా రెమ్యూనరేషన్ భారీగానే పెంచేసిందట. ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో నటిస్తుంది. డిస్కో రాజా సినిమాతో నాభ క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు .. ఇప్పటి వరకు 40 -50 దాకా తీసుకునే ఈ అమ్మడు డిస్కో రాజా సినిమాకు ఏకంగా 60 తీసుకుందని, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాకైతే ఏకంగా 80 వరకు తీసుకున్నట్టు టాక్. ప్రస్తుతం తాను డిమాండ్ చేసినంత ఇచ్చారా ఓకే .. లేదంటే నో చెప్పేస్తుందట !!