ఇంతకీ ఈ నీచమైన పని చేసిందెవరు నిఖిల్

కావాలని చెడు ఉద్దేశంతోనే కొందరు తన సినిమాలాంటి పోస్టర్‌ను డిజైన్‌ చేశారని మండిపడుతున్నాడు సినీ నటుడు నిఖిల్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ ఇయిర్ విడుదల కావాల్సి ఉంది కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తికాకపోవటంతో పోస్ట్ ఫోన్ చేశారు.

అయితే తమ సినిమా పోస్టర్‌కు వాడిన లోగోనే మరో చిత్ర యూనిట్ వాడటంతో నిఖిల్‌ షాకయ్యారు. ఈ సినిమా ఈ వారమే(25-01-2019) రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ సదరు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్‌ను సేమ్‌ డిజైన్‌తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్‌ యాప్‌లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా, ఇది చాలా నీచమైన పని’అన్నారు.

అంతా బాగానే ఉంది కానీ ..ఇంతకీ నిఖిల్ ని ఇంతలా మోసం చేస్తున్న సినిమా ఎవరిది..వాళ్ల డిటేల్స్ ఇస్తే బాగుండేది అంటున్నారు నెట్ జనులు.