‘పులిజూదం’ ఆడుతున్న స్టార్స్…గెలుపు ఎవరిదో?

రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పులిజూదం’. మల్టీస్టారర్ సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్‌, శ్రీకాంత్‌, మోహన్‌లాల్‌, హన్సిక, రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా తాజాగా చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది చిత్రయూనిట్.

Puli Joodham Movie Official Trailer | Mohanlal | Vishal | Srikanth | Hansika | Raashi Khanna

ఒక నిమిషం 57 సెకనుల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.‘ప్రతీ హీరోలో ఓ విలన్‌ ఉంటాడు.. ప్రతీ విలన్‌లో ఓ హీరో ఉంటాడు’ , ‘‘తప్పు చేస్తే భయపడాలి. భయపడతారు. ఎందుకంటే ఆ భయానికి రెండో పేరుంది. డా. మదనగోపాల్‌’’వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ తో వచ్చిన టీజర్ కేక పెట్టిస్తోంది.

రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ… క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ఇది. ఏ పాత్ర ప్రత్యేకత ఆ పాత్రకు ఉంటుంది. తెలుగు హీరో శ్రీకాంత్ గారు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. అలాగే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మోహన్ లాల్, తెలుగువాడైన విశాల్, తెలుగు హీరోయిన్లు రాశీ ఖన్నా, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారుల పాత్రల్లో మోహన్ లాల్, రాశీ ఖన్నా అద్భుతంగా నటించారు” అన్నారు.

చిత్రంలో మోహన్‌లాల్‌ పోలీస్‌ అధికారిగా, రాశీ ఖన్నా పోలీస్‌ కానిస్టేబుల్‌గా, హన్సిక బార్‌ డ్యాన్సర్‌గా, విశాల్‌ వైద్యుడిగా, శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్నారు. మార్చి 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.