మోహన్ బాబు ‘చెడ్డవాళ్లు’ అన్నది ఎవరిని ఉద్దేశించి?

మోహన్ బాబు ఏం మాట్లాడినా అందులో ఏదో రెండో అర్దం ఉండే ఉంటుందంటారు సినిమావాళ్లు. ఆవేశంగా స్పందించినా ఆయన మాటల్లో నిజాయితీ, ఆచి తూచి మాట్లాడే తత్వం అందరికీ నచ్చుతుంది. మంచిని ఎంతగానో మెచ్చుకునే ఆయన చిన్న తప్పు జరిగినా ఖండించందే ఆగలేరు. దాంతో ఆయన ఏం మాట్లాడినా మీడియా చూపు అంతా అటు వైపే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారాయి.

వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌ సన్నిహితులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేడుకలో ప్రసంగించిన మోహన్‌ బాబు చివర్లో ‘క్రిష్‌.. యు డిడ్‌ ఏ వండర్‌ఫుల్‌ జాబ్‌.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ‍్లను కూడా మంచి క్యారెక్టర్స్‌ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ముగించారు.

మోహన్ బాబు మాటలు ప్రకారం..చెడ్డవాళ్లు అనేది ఎవరు…ఎవరిని ఉద్దేశించి ఆయన చెడ్డవాడు అన్నారు..అనేది ఆసక్తిగా మారింది. అలాగే రీసెంట్ గా కేసీఆర్ గెలవాలని ఆయన పూజ సైతం చేసానని కామెంట్స్ చేసి మీడియాలో టాపిక్ గా మారారు. ఈ నేపధ్యంలో చెడ్డవాడు అనే మాట ..చంద్రబాబుని ఉద్దేశించి మోహన్ బాబు అన్నారా లేక వేరొకరినా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారింది.

ఇక బాలకృష్ణ స్వయంగా తన తండ్రి నందమూరి తారకరామారావు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రణీత, శాలినీ పాండే, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌ అలనాటి అందాల భామలుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్‌, సుమంత్‌, కైకాల సత్యనారాయణ, ప్రకాష్ కోవెలమూడి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.