ఛార్మిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న మెగా ఫ్యాన్స్..!

ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతాన్ని కర్మ ఫలితాన్ని చాలా నమ్ముతారు. ఏదొక సందర్భంలో ఇది నిజం అవుతుంది అని అంటారు. మరి ఇప్పుడు ఈ అంశం లోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కోసం తెలియని వారు పెద్దగా ఉండరు.

హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు నిర్మాతగా మారి దర్శకుడు పూరి జగన్నాథ్ తో నిర్మాతగా సెటిల్ అయిపొయింది. మరి ఇలా తాను లేటెస్ట్ గా తీసిన సినిమానే “లైగర్”. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే అనన్య పాండే లతో తీసిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ ఆట తోనే తేలిపోయింది.

దీనితో ఈ సినిమా ప్లాప్ అనే టాక్ గట్టిగా స్ప్రెడ్ అయిపొయింది. అయితే ఓ టైం లో ఛార్మి చేసిన పని వల్లే ఇప్పుడు ఈ సినిమాకి ఇలా జరిగింది అని పర్టిక్యులర్ గా మెగా ఫ్యాన్స్ ఛార్మి ని ఓ రేంజ్ లో ఇప్పుడు ఆడుకుంటున్నారు.

గతంలో పూరి జగన్నాథ్ కి దర్శకునిగా నిర్మాతగా ఛార్మీ కి మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమా ఛాన్స్ ఇచ్చారు కానీ పూరి ఆ ఛాన్స్ ని సరైన కథతో చిరు ని మెప్పించలేకపోయాడు. దీనితో ఆ టైం లో చిరు రీమేక్ ని ఎంచుకోవాల్సి వచ్చింది.

దీనితో హర్ట్ అయిన ఛార్మి అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “బ్రూస్ లీ” సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ రిలీజ్ రోజునే సోషల్ మీడియాలో తెగ ఆనందపడుతూ పోస్ట్ చేసింది. దీనితో అప్పట్లోనే వైరల్ గా మారిన ఈ ట్వీట్ ఇప్పుడు లైగర్ ప్లాప్ కావడంతో దొరికింది. ఇక దెబ్బకు మెగా ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని డిగ్ చేసి ఛార్మి కి నీతి బోధలు చెప్తూ ట్రోల్ చేస్తున్నారు.