షూటింగ్ లో గాయపడ్డ వార్త నిజమే కానీ…

ప్రముఖ మలయాళ నటి మంజూ వారియర్ తీవ్రంగా గాయపడ్డారంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమే కానీ..ఆమె గాయపడి చాలా రోజులైంది. కానీ బయిటకు ఇన్నాళ్లకు వచ్చింది. దాంతో మీడియా మొత్తం ఇదే వార్తను స్ప్రెడ్ చేస్తోంది. ఆమె రికవరీ అయ్యి ఈ రోజు షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయం దర్సకుడు సంతోశ్ శివన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు.

సంతోష్ శివన్ దర్శకత్వంలో మంజూ వారియర్ జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో మంజూ పాల్గొనగా.. యాక్షన్ సన్నివేశాలలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తలరించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె గాయానికి కుట్టు వేశారని.. మంజు కోలుకున్న తరువాతే షూటింగ్ ప్రారంభించాలని ఆపేసారు. కాగా ఆమె రికవరీ అయ్యి ఈ రోజు షూటింగ్ లో పాల్గొంది. ఈ చిత్రంలో జయరాం హీరోగా నటిస్తున్నాడు.