‘డాష్ పగిలిపోద్ది’ అంటూ పబ్లిక్ గా మంచు మనోజ్

‘ఇప్పుడే చూసా..అది డిలేట్ అయ్యి ఉంది. ఎందుకనేది నాకు తెలియదు..వెయిట్…అయినా నన్ను ఫోర్స్ చేసే మగాడు ఎవరు బ్రదర్..డాష్ పగిలిపోద్ది’ అంటూ మనోజ్ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. అలా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే కాస్త వెనక్కి వెళ్లాలి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ కేవలం తమ సినిమాల గురించి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అలానే అభివృద్ధి పథకాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను అభిమానాలకు షేర్ చేస్తూంటారు.

ఈ నేపధ్యంలో నిన్న ‘కియా మోటార్స్’ ఏపీకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

అలాగే ‘కియా మోటార్స్’ మొదటి వెహికల్ మన ఏపీలో తయారు చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని మంచు మనోజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని ఏపీకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి బిగ్ చీర్స్ అని అన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇదొక విజ్ఞతతో కూడిన ముందడుగు అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కొద్ది సేపటికే ట్విట్టర్ లో లేకుండా పోయింది. దాంతో అందరూ మంచు మనోజ్ కు ఈ ట్వీట్ ఎందుకు డిలేట్ చేసారంటూ క్వచ్చిన్స్ తో కూడిన ట్వీట్స్ చేసారు. దానికి రిప్లై గా పై ట్వీట్ చేసారు. అయితే ఆ ట్వీట్ ని తను బూతులు తిడుతున్నానని ప్రెండ్ అనటంతో డిలేట్ చేసారు మనోజ్.