మహేష్ మిడ్ నైట్ సర్పైజ్

మహేష్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే మే 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో 9.18 amకి అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

కాగా తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా ఎకౌంట్ లో ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ఏదో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది.

దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని నెలల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేసి జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరఫ్ వెకేషన్లో ఉన్న మహేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగులో జాయిన్ కాబోతున్నాడు.

ఈ సినిమాలో విజయశాంతి, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌కు జోడిగా రష్మిక మందాన్నను హీరోయిన్‌గా తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నేటి అర్దరాత్రికి ఈ రూమర్స్‌కు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్‌ను చిత్ర నిర్మాతలు మిడ్‌నైట్‌కు ప్రకటించనున్నారు.