‘మహర్షి’ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహర్షి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విక్టరీ వెంకటేశ్‌ ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మహేష్ క్లాస్‌, మాస్‌ లుక్‌లో కనిపించారు.

#MaharshiTrailer | Mahesh Babu, Pooja Hegde, Allari Naresh | Vamshi Paidipally | DSP | 4K

ట్రైలర్ ప్రారంభంలో ‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రిషి’ అని రావు రమేశ్‌ ప్రశ్నిస్తే.. ‘ఏలేద్దాం అనుకుంటున్నాను సర్‌. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా’ అంటాడు మహేష్. విజయాన్ని ఎలా లెక్కిస్తాం సర్‌ అని విలేకరి మహేశ్‌ను ప్రశ్నిస్తే.. ‘గతంలో ఎక్కడ ఉన్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.. దాన్ని బట్టి మనకే అర్థం అవుతుంది..’ అని ఆయన అన్నారు. ‘ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం..’ అంటూ ఎంతో ఉత్కంఠంగా ట్రైలర్‌ సాగింది.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.