‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’. ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ వస్తే చాలు రికార్డ్స్ క్రియేట్ చేయటానికి సోషల్ మీడియాని షేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ అభిమానులు.కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోగా కనీసం ఇచ్చే ప్రకటన కూడా ఇవ్వ లేదు.దీనితో మహేష్ అభిమానులు మాత్రం కొద్దిగా నిరాశలోనే ఉన్నారు.

సినిమాకు సంభందించి అప్డేట్ లు రాకపోయినా గాసిప్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇది గమనించి ఫ్యాన్స్ ఖుషీ చేయటానికి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ ఫిక్సైంది. అందుకు సంభందించిన సమాచారం తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసింది.

దాంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే టైం స్టార్ట్ అయ్యినట్లైంది. గత కొన్ని రోజుల క్రితమే మహర్షి టీజర్ కోసం అప్డేట్ కావాలంటూ ట్విట్టర్లో మహేష్ అభిమానులు చేసిన రచ్చ ఫలితం ఇచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాలపై ఉన్న రూమర్స్ కు చెక్ చెప్తూ…అన్ని సస్పెన్సులకి తెర దించుతూ అధికారిక విడుదల తేదీని ఖరారు చేసిన టీమ్ ..టీజర్ రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసింది.

మహర్షి సినిమా ఫస్ట్ సింగల్ ను మరో నాలుగు రోజుల్లో మార్చి 29వ తేదీన విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.వచ్చే మే నెల 9 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.