మ‌హేష్ ఆప‌రేష‌న్ కోసం అమెరికా వెళ్లాడా?

మ‌హేష్ అమెరికా వెళ్లింది విశ్రాంతి తీసుకోవ‌డానికి కాదా?. ఆయ‌న కుటుంబంతో క‌లిసి వెళ్లింది మ‌రో ప‌ని కోస‌మేనా అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్నిసొంతం చేసుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ త‌న మోకాలి స‌ర్జ‌రీ కోసం అమెరికా వెళ్లార‌ట‌. 2014లో శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ చేసిన చిత్రం `ఆగ‌డు`.

ఈ సినిమా కోసం బ‌ళ్లారీ గ‌నుల్లో కీల‌క యాక్ష‌న్ ఎపిసోడ్‌ని చిత్రీక‌రించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో మ‌హేష్ మోకాలికి గాయం అయిందంట‌. వ‌రుస షూటింగ్‌ల‌ కార‌ణంగా మ‌హేష్‌ సీరియ‌స్‌గా తీసుకోలేద‌ట‌. ఆ గాయం తిర‌గ‌బెట్ట‌డం వ‌ల్ల 2017లో ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌నుకున్నార‌ట‌. అప్ప‌టికీ ఫ్లాపుల్లో వుండ‌టంతో మ‌ళ్లీ ఐదు నెల‌లు విరామం తీసుకోవ‌డం ఇష్టం లేక మ‌హేష్ ఆప‌రేష‌న్‌ని మ‌ళ్లీ వాయిదా వేసుకున్నార‌ట‌. తాజాగా `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందుకున్న మ‌హేష్ ఆప‌రేష‌న్ చేయించుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని గ్ర‌హించి మోకాలి శ‌స్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లార‌ట‌.

మహేష్ గాయాన్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ త‌రువాత ఐదు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పార‌ట‌. దీంతో ఐదు నెల‌ల త‌రువాతే వంశీ పైడిప‌ల్లి చిత్రానికి డేట్స్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలిసింది.