‘అంతరిక్షం’ : మహేష్ మ్యాటర్,పులిహార వార్తేనా?

రానా హీరోగా తెలుగులో ఘన విజయం సాధించిన చిత్రం ఘాజీ . ఈ చిత్రం దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అంతరిక్షం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే ఇప్పటివరకూ చిత్రం ట్రైలర్ రిలీజ్ కాదు. దాంతో సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించటానికి సిద్దం చేసారు.

దాంతో అటు ట్రైలర్ కు, ఇటు ఏ ఎంబీ సినిమాస్ కు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..మహేష్ బాబు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చే అవకాసం ఉందని తెలుస్తోందంటూ వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పులిహార వార్తేనని, మహేష్ ఈ ఈవెంట్ కు వచ్చే అవకాసం లేదని, అసలు అలాంటి ప్రపోజలే లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. దర్శకుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితిరావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక సూపర్‌ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్‌ నిర్వహించుకోబోతున్న సినిమా అంతరిక్షం కావటంతో క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.