స్టేజీపై కాల‌రెగ‌రేసిన మ‌హేష్‌..కారణం ఇదే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసారు. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ వాటిలో చాలానే ఉన్నా ఎప్పుడూ మహేష్ కాల‌రెగ‌రేసి మాట్లాడింది లేదు. తాజ‌గా విడుద‌లైన మ‌హ‌ర్షి మంచి స‌క్సెస్ అవటం ఆయనకు బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా భారీ వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోవటం బాగా ప్లస్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ కాల‌రెగ‌రేసి మ‌రీ మీడియా ముందు మాట్లాడారు.

మహేష్ మాట్లాడుతూ… వంశీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘మహర్షి’ విడుదల తర్వాత నాన్న అభిమానులు, నా అభిమానులు కాలర్‌ ఎత్తుకుని తిరుగుతారు అన్నారు. వాళ్లు కాలర్‌ ఎత్తారు వంశీ.. ఇప్పుడు నేను కూడా కాలర్‌ ఎత్తుతున్నా. (అంటూ.. మహేశ్‌ కాలర్‌ ఎగరేశారు..ఆనందంలో వంశీ మహేశ్‌ను కౌగిలించుకున్నారు).

అలాగే నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్స్‌ను ‘మహర్షి’తో ఒక వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించింది నాకు ఏమీ లేదు. ఈ సినిమాలో నటించినందుకు నరేష్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు ఇంత పేరువచ్చినందుకు కారణం మీరు కూడా అని అన్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ నటన, కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర యూనిట్ అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.