చూద్దామంటే నాకే టిక్కెట్లు దొరకలేదు: మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన సొంత థియోటర్ ఉన్నా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’..టిక్కెట్లు దొరకక వెయిట్ చేయాల్సి వచ్చిందిట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ‘అందరూ ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ బాగుందని అంటున్నారు. ఆ సినిమా చూద్దామని ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు అడిగితే, ఏడు షోల వరకూ ఖాళీనే లేదని చెప్పారు. నేడో.. రేపో ఈ సినిమా చూస్తా’ అని అన్నారు. ‘మహర్షి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్న మహేశ్‌కు.. ఎట్టకేలకు ఈ సినిమాను చూసే టైమ్ దొరికింది.

అలా తాను ప్రారంభించిన ఏఎంబీ (ఏషియన్‌ మహేశ్‌బాబు సినిమాస్‌‌) థియేటర్‌లో తొలి సినిమాను చూసేశారట. ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమాను ఆదివారంచూసానని మహేశ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘ఏఎంబీ సినిమాస్‌లో తొలి సినిమా చూశాను. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’.. చాలా నచ్చింది. ఈ థియేటర్‌లో చూడటం మరింత చక్కని అనుభూతినిచ్చింది. థాంక్యూ ఏఎంబీ టీం. యూ గయ్స్‌ రాక్‌..’ అని పేర్కొంటూ టీంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ , పాటలు జనాల్లోకి వెళ్లి సంచలనం సృష్టిస్తున్నాయి.