వార్ మూడ్ కు తగినట్లుగా మహేష్ ఫస్ట్ లుక్ వదిలాడు

ప్రస్తుతం దేశంలో వార్ మూడ్ నడుస్తోంది. పాక్ కు, మనకు యుద్దం వస్తుందా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. టీవి ఛానెల్స్ లో అదే విషయమై నిరంతరం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబు తను ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ వదిలారు. ఆ సినిమా కూడా దేశభక్తికి సంభందించింది కావటం విశేషం.

ఇన్నాళ్లు తన చిత్రాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన మహేష్‌, ఇప్పుడు ఇతర హీరోలతో, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య డిజిటల్‌ రంగంలోకి అడుగు పెట్టి చార్లీ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా మరో బిగ్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌.

క్షణం, గూఢచారి లాంటి సూపర్‌ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్‌ హీరోగా ఓ బయోగ్రాఫికల్‌ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్‌. ఈ సినిమాలో బాలీవుడ్ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ తెలుగులోకి అడుగుపెట్టబోతోంది. అంతేకాదు ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందనుండటంతో ఈ సినిమాలో మహేష్‌ నిర్మాతగా బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు.

మేజర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరోసారి అడవి శేష్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేం శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించనున్నాడు.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశారు. అడివి ఎంటర్‌టైన్మెంట్స్‌, శరత్ చంద్ర, ఏ+ఎస్‌ మూవీస్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈసినిమా షూటింగ్ 2019 వేసవిలో ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో సినిమా విడుదలకానుంది.