భార్య ఒత్తిడితో గెస్ట్ రోల్ లో మహేష్ ?

గతంలో తమ సొంత బ్యానర్స్ లో సినిమాల్లో కానీ, లేదా తమకు బాగా కావాల్సిన వారి సినిమాల్లో కానీ గెస్ట్ రోల్స్ లో కనిపించటానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపించేవారు. చిరంజీవి ..హ్యాట్యాఫ్ సినిమాలో కనిపించినా, వెంకటేష్ తన మేనల్లుడు సినిమాలో కనిపించినా, బాలకృష్ణ మంచు ఫ్యామిలీ సినిమాలో కనిపించినా ఇలా జరిగినవే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్స్ మహేష్ బాబు లాంటివారు అలా గెస్ట్ గా కనిపించటానికి ఇష్టపడటం లేదు. కానీ త్వరలో మహేష్ గెస్ట్ గా కనిపించే అవకాసం ఉందని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే… రీసెంట్ గా తన చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. త్వరలో తమ సొంత బ్యానర్ లో మిగిలిన హీరోలతో చిన్న సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రొడక్షన్ వ్యవహారాలను మొత్తం నమ్రత చూసుకుంటోంది. తమ నిర్మాణంలో వచ్చే సినిమాల వరసలో మొదటి చిత్రంగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాలని ఆమె అనుకుంటున్నారని సమాచారం.

అయితే ప్రాజెక్టు కు క్రేజ్ రావటం కోసం … ఈ సినిమాలో ఓ కీలక పాత్రను మహేష్ చేత చేయిస్తే బావుంటుందని నమ్రత భావిస్తున్నారట. మొదట ఇలాంటివి తను ఇష్టపడనని చెప్పిన మహేష్ …తన భార్య ఒత్తిడితో.. తాము నిర్మించే చిత్రమే కాబట్టి అందులో అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా మహేష్ ప్రస్తుతం మహర్షి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, పీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్స్, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.