‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలెట్ అదే

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ఓ సమస్య ఎదురైంది. మొదట ఈ ఈవెంట్ ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీగా ప్లాన్ చేసారు. కానీ ఈవీఎం మెషీన్లు అన్నీ ఉన్నది అక్కడే కావటంతో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేవరకూ అనుమతులు లభించలేదు. దాంతో నెక్లెస్ రోడ్- పీపుల్స్ ప్లాజాని వెన్యూగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వెన్యూకి ఇప్పటికే ఫర్మిషన్స్ వచ్చేశాయి. అలాగే ఈ వేడుకను మే1న ప్లాన్ చేశారు. ఆరోజు ఎలానూ కార్మికల దినోత్సవం సెలవు రోజు కాబట్టి మహేష్ అభిమానులు ఈ వేడుకకు భారీగా తరలి వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లు ఎవరూ అంటే .. ఎప్పటిలాగే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ . అలాగే మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటివరకూ మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు ఆయన గురించి తమ మనసులో మాటను చెప్పే వీడియోను ఈ వేదికపై ప్లే చేస్తారట. అలాగే ఆ దర్శకులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించి సన్మానం చేస్తారని తెలుస్తోంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు – అశ్వినీదత్ – పీవీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.