స్టోరీ సెట్ చేసుకున్న మహర్షి దర్శకుడు.. జనవరి నుంచే..

Mahesh wishes Vamsi Paidipally-Clears the suspense

బృందావనం ఎవడు వంటి కమర్షియల్ హిట్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంమ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆ తరువాత ఊపిరి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందించకపోయినప్పటికి వంశీకి మరింత క్రేజ్ దక్కింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసిన వంశీ ఆ తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

Mahesh wishes Vamsi Paidipally-Clears the suspense

ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వకముందే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని స్టేట్ రౌడీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం వంశీ మహేష్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ రాకముందే ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఆహా యాప్ కోసం ప్రత్యేకంగా హై బడ్జెట్ లో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో రూపొందనున్న ఆ సిరీస్ ను జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారట.

వంశీ పైడిపల్లి మహేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసలైతే సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాతే వంశీతో సినిమా చేయాల్సింది. కానీ కథ నచ్చకపోవడం వలన మహేష్ రిజెక్ట్ చేశాడట. ఇక ఇటీవల మరో కథతో మెప్పించినట్లు టాక్ అయితే వస్తోంది. సర్కారు వారి పాట తరువాత వీరి కాంబో సెట్స్ పైకి రావచ్చని ఒక కొత్త టాక్ అయితే వైరల్ అవుతోంది.