`మా` అధ్య‌క్షుడిపై స‌భ్యులు ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో స‌భ్యుల మ‌ధ్య‌ విబేధాలు మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ వార్ అధ్య‌క్షుడు -జీవిరాజశేఖ‌ర్ ల మ‌ధ్యే జ‌రిగింది. తాజాగా ఈవివాదం స‌భ్యుల‌కు తాకింది. న‌రేశ్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు. `మా` అభివృద్దికి న‌రేశ్ అడ్డంకిగా మారార‌ని, నిధులు దుర్వినియోగం చేయ‌డంతో పాటు, ఈసీ స‌భ్యుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేసారు. దీనిలో భాగంగా న‌రేశ్ లోపాల‌ను ఎత్తి చూపుతూ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఈసీ సభ్యులు 9 పేజీల లేఖ రాశారు. అలాగే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన న‌రేశ్‌పై స‌భ్యులు సంఘానికి ఫిర్యాదు చేసారు.

నరేష్ నిర్ణయాలతో ‘మా’ పూర్తిగా భ్రష్టుపట్టి పోతుంద‌ని.. ‘మా’ సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేద‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత లేఖలో పేర్కొన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి 15 మంది ఈసీ స‌భ్యులు లేఖ రాశారు. న‌రేశ్ ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోతున్నార‌ని, స‌భ్యులెవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే ఏక ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని లేఖ‌లో సభ్యులు పేర్కొన్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మా రియాక్ష‌న్ పెద్ద‌ల వైఖ‌రి ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవ‌లే `మా `వివాదాల‌న్నింటికి పుల్ స్టాప్ పెట్టాల‌ని డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా పెద్ద‌లు చిరంజీవి, కృష్ణంరాజు మోహ‌న్ బాబు, సుబ్బ‌రామిరెడ్డి అన్నారు. ఆ భేటి ర‌సాభ‌స‌గా జ‌రిగింది. అప్పుడు రాజ‌శేఖర్ తీరుపూఐ అంతా అసహ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.