వీడియో: వైఎస్ `యాత్ర‌` నుంచి లిరిక‌ల్ సాంగ్‌

దివంగత ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజ‌కీయ జీవితంలోని కీల‌క పాదయాత్ర ఘట్టాన్ని ప్ర‌ధాన కథాంశంగా తీసుకుని రూపొందించిన సినిమా `యాత్ర‌`. మలయాళ సూప‌ర్‌స్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ పాత్రలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం నుంచి శ‌నివారం లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్రం యూనిట్‌. `పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది..` అంటూ సాగే ఈ పాటలో రైతుల కష్టాలను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆల‌పించారు. కె సంగీతాన్ని అందించారు. మహి వీ రాఘవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న తెలుగుతో పాటు త‌మిళం, మాల‌యాళ‌ భాషల్లో విడుదలవుతోంది.

https://www.youtube.com/watch?v=OQmQXvTHVHE