మహేష్ కు అనుకున్న కథ ‘కేజీఎఫ్’ హీరోతోనా?

మహేష్ కు అనుకున్న కథ ‘కేజీఎఫ్’ హీరోతోనా?

మహేష్, పూరి కంబినేషన్ లో 2016లో ప్రకటించిన జనగణమణ ప్రాజెక్టు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ బయటకి రాదు అనుకుంటున్న టైంలో పూరి జనగణమణ స్క్రిప్టును విజయ్ దేవరకొండ దగ్గరకు తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడా ఈ ప్రాజెక్టుని తెలుగు హీరోతో కాకుండా కేజీఎఫ్‌ సినిమాతో నేషన్ వైడ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యష్‌తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం దేశ రాజకీయాలకు, పరిస్థితులకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసిన పూరి యష్‌కు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హత్యాచార ఘటనలు, నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.. తెలుగు, కన్నడ భాషల్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ వార్తలపై పూరి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్‌తో సాలిడ్‌ హిట్‌ కొట్టాడు. మాస్‌ మసాలా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల మార్క్‌ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.