అండర్ గ్రౌండ్ కు బోయపాటి శ్రీను?

ఎన్నో అంచనాలుతో తయారయ్యే పెద్ద సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టినా చాలా మంది నష్టపోయే పరిస్దితి ఉంది. కోట్లలో డబ్బు పోగొట్టుకుంటారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్. దర్శకుడు, హీరో సిట్యువేషన్ వేరే విధంగా ఉంటుంది. వాళ్ల కెరీర్ పై డైరక్ట్ గా దెబ్బ పడుతుంది.

రామ్‌చరణ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం మార్నింగ్ షోకే ప్లాఫ్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫ్లాఫ్ అని డైరక్ట్ గానిర్మాత డివివి దానయ్య ఒప్పుకుని, డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కి ఇచ్చేసే పనిలో పడ్డారు. సినిమా ప్రమోషన్స్ ఆపేసారు. ఈ నేపధ్యంలో తన సినిమాలను విపరీతంగా ప్రమోట్ చేసుకునే దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ లో లేకుండా మిస్సయ్యారు.

దాంతో బోయపాటి ఏం చేస్తున్నారు..ఎక్కడున్నారు…ఎక్కడా చిన్న ఇంటర్వూ లో కూడా కనిపించలేదే అని మీడియా వర్గాల్లో చర్చగా మారింది. వచ్చే ఇంటర్వూలు అన్నీ రిలీజ్ ముందు షూట్ చేసినవే కావటం గమనార్హం. అంటే రిలీజ్ తర్వాత రోజే వచ్చిన దారుణమైన టాక్ కు ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లాడని వార్తలు మొదలయ్యాయి. ఎవరితో ఫోన్ లో కూడా టచ్ లో లేడని అంటున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన సినిమా ఈ స్దాయి డిజాస్టర్ ఆయన ఊహించలేదంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం తను బాలకృష్ణతో చేయబోయే తదుపరి చిత్రం స్క్రిప్టు వర్క్ నిమిత్తం ప్రశాంతమైన ప్లేస్ లో, ఎవరికి అందరకుండా లీనమై పనిచేసుకుంటున్నాడంటున్నారు. బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో మూడో సినిమా ఇది. ఇప్పటికే సింహా, లెజండ్ చిత్రాల్లో ఆయన బాలయ్యను డైరక్ట్ చేసారు.