ర‌ష్మిక పారితోషికం ఎంత అడుగుతోందో తెలుసా .. అబ్బో!

బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో స్పీడ్ మీద ఉంది ర‌ష్మిక మంద‌న‌. సంక్రాంతికి రిలీజైన స‌రిలేరు నీకెవ్వ‌రు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత నితిన్ స‌ర‌స‌న న‌టించిన `భీష్మ` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.  ఆ రెండు విజ‌యాల‌తో జోష్ లో ఉన్న ఈ బ్యూటీ త‌దుప‌రి అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప‌లో నాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  

వ‌రుస‌గా మ‌హేష్‌.. బ‌న్ని లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు అందుకోవ‌డంతోనే ఈ అమ్మ‌డు త‌న రేంజును అమాంతం పెంచేసింది. కెరీర్ ఆరంభించిన కేవ‌లం నాలుగైదేళ్ల‌కే ఏకంగా రూ.2కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేసేస్తోంది. ఇటీవ‌ల ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌ను సంప్ర‌దిస్తే పారితోషికం గురించి చెప్పి షాకిచ్చింద‌ట‌. ఆ రేంజుకు ఎంత మాత్రం తగ్గ‌న‌ని ర‌ష్మిక భీష్మించుకుని కూచోవ‌డంతో చేసేదేమీ లేక ఇక వేరే హీరోయిన్ ని వెతికే ప‌నిలో ఉన్నారు.

వ‌రుస స‌క్సెస్ ల‌తో రేంజు పెరిగిన సంగ‌తి స‌రే కానీ.. క‌రోనా క్రైసిస్ నిర్మాత‌ల పుట్టి ముంచింది. ఇలాంటి స‌మ‌యంలో ప‌ట్టు వీడ‌క బెట్టు చేస్తే అమ్మ‌డిని దూరం పెట్టే ప‌రిస్థితే ఉంటుంది కానీ.. ఇలా చేయ‌డం స‌రియైన ప‌ద్ధ‌తి కాద‌ని ర‌ష్మిక‌కు అభిమానులు సూచిస్తున్నారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకునే మూడ్ లో ఈ అమ్మ‌డు లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పారితోషికాల త‌గ్గింపుపై అటు హీరోలు హీరోయిన్లు.. టాప్ టెక్నీషియ‌న్ల‌తో నిర్మాత‌లు ముచ్చ‌టిస్తున్నారు. నిర్మాత‌ల గిల్డ్ పెద్ద‌లు స్ట్రీమ్ లైన్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.