ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా షూట్ ఇంకా ప్రారంభం అవ్వకముందే ఆ సినిమా పై ఇష్టం వచ్చినట్టు బోలెడు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ షూట్ మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. అయితే ఇప్పటి నుంచే ఈ చిత్రంలో కథానాయిక ఎవరు అన్న దాని మీద బోలెడు గాసిప్ లు అల్లుకుంటున్నారు.
కానీ ఇప్పటి వరకు వినిపించిన, వినిపిస్తున్న పేర్లేవీ దర్శకుడు త్రివిక్రమ్ పరిశీలనలో లేవు అని తెలుస్తోంది. చాలా మంది మళ్లీ పూజా హెగ్డే నే హీరోయిన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. కానీ పూజా హెగ్డే ను మళ్లీ తీసుకుంటే కొత్త సినిమాలా అనిపించదుగా అనే జోక్సు కూడా వేసుకున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ మనసులో ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ కు జోడీగా నటించిన కియరా అద్వానీ పేరు ప్రస్తుతం పరిశీలనలో వుందని సమాచారం. ఒకవేళ ఆమె డేట్సు అందుబాటులో లేకుంటే మరొకరు ఎవరా? అని కూడా ఆలోచిస్తున్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ సరసన కనిపించే అవకాశం కియరా అద్వానీకే ఉన్నట్టు యూనిట్ అంతా గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఇంతకముందు వినిపించిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ పూజ హెగ్డేని హీరోయిన్ గా పెట్టాలనుకున్నారట. అయితే కియారా అద్వానీ అయితే బాగుంటుందని ఎన్టీఆర్ అన్నారట. చివరగా ఎన్టీఆర్ మాటే నెగ్గింది.