‘మహర్షి’ సినిమాపై శ్రీనువైట్ల కామెంట్

ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది మహర్షి సినిమా. మహేష్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా థియేటర్ల సంఖ్య పరంగా ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. మరోవైపు తొలిరోజు వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేఫద్యంలో ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను, ప్రశంసలను అంద చేస్తుననారు.

తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘‘మహర్షి’ సినిమా చూశాను. రైతు, స్టూడెంట్, సీఈవో‌గా మహేశ్ నటన చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థిగా మహేశ్ లుక్, ఎనర్జీ కొత్తగా అనిపించింది. అల్లరి నరేశ్ నటన గుండెలకు హత్తుకునేలా ఉంది. డైరెక్టర్ వంశీ నిజాయితీగా ఈ సినిమాని తెరకెక్కించారు.’ అని పేర్కొన్నారు. హీరో మహేశ్ బాబుతో దర్శకుడు శ్రీను వైట్ల.. దూకుడు, ఆగడు చిత్రాలను తెరకెక్కించారు.

‘మహర్షి’ సినిమాని దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, వైజ‌యంతీ మూవీస్‌, పీవీపీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేశ్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, జ‌గ‌ప‌తిబాబు, మీనాక్షి దీక్షిత్ త‌దిత‌రులు నటించారు.