మహేష్ వివాదానికి ముగింపు పలికిన పూరి

మహేష్ వివాదానికి ముగింపు పలికిన పూరి

చాలా ఏళ్లగా సరైన హిట్ అనేదే చూడని పూరి రీసెంట్ గా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ కొట్టాడు. ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా లాభాల బాట పట్టింది. 17 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద యాభై కోట్ల మార్క్ ని అతి త్వరలోనే దాటుతుందని విశ్లేషకుల అంచనా. ఈ సక్సెస్ పూరికి ఎంతో ఊరటనిచ్చింది. అయితే ఇదే సమయంలో మహేష్ బాబు తో వివాదం సైతం మీడియాలో హైలెట్ అయ్యింది.

దర్శకుడు పూరి జగన్నాధ్ ఇటీవలే మహేష్ బాబుపై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆయన్ని పలకరిస్తూ మహేష్‌తో మళ్లీ ఓ సినిమా తీయమన్నారు. దానికి పూరి బదులిస్తూ.. ‘‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశాననే ప్రేమతో మరో సినిమా చేయమని అభిమానులు అడుగుతుంటారు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాళ్ల కోసం చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు’’ అనేశాడు పూరి. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాకా అవకాశం ఇచ్చినా ఒప్పుకోవడానికి తన ఆత్మాభిమానం ఒప్పుకోదన్నట్టు పూరి చెప్పాడు.

అయితే మీడియావాళ్లు దాన్ని ఆ స్దాయిలో హైలెట్ చేస్తారని ఊహించలేదు పూరి జగన్నాథ్. అంతేకాదు ఆయన ఏ ఇంటర్వూకు వెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారు. అదో పెద్ద వివాదం గా మారుతోందని పూరికి అర్దమైంది. అంతేకాక ఆ వివాదానికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాఫ్ పెట్టాలనుకున్నారు. అందుకే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో యాంకర్ మళ్లీ అదే టాపిక్ తేవటానికి ప్రయత్నిస్తే తనుకు ఆ టాపిక్ పై మాట్లాడటం ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పారు. దాంతో బ్రేక్ పడింది. దాంతో ఇక నుంచి ఆయన్ను ఈ వివాదం గురించి మీడియావారు ప్రశ్నించరని ఆయన భావిస్తున్నారు.