నిజామాబాద్ లో నేటి రాత్రికి దిల్ రాజు వివాహం

లాక్ డౌన్ నేప‌థ్యంలో పోలీస్ కాన్సెప్ట్.. రాజుగారు అంతేగా!

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల‌తో ఒక‌రైన దిల్ రాజు రెండ‌వ పెళ్లి సిద్ద‌మ‌వుతున్నారంటూ గ‌త కొన్ని నెల‌లుగా సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య అనిత స్వ‌ర్గస్తులైన కొన్ని నెల‌లుగా ఇలాంటి ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో పీక్స్ లో జ‌రిగింది. అయితే గ‌త రెండు నెల‌లుగా ఈ త‌ర‌హా ప్ర‌చారం ఫిలిం స‌ర్కిల్స్ లో మ‌రింత వేడెక్కిస్తోంది. తాజాగా రాజుగారు ఆ క‌థ‌నాలు నిజం చేస్తూ రెండ‌వ పెళ్లికి రెడీ అయ్యారు.

ఆ వివాహం ఎప్పుడో కాదు…నేటి రాత్రికి దిల్ రాజు స్వ‌స్థ‌ల‌మైన‌ నిజామాబాద్ లో జ‌రుగుతుంది. నిజామాబాద్ లో దిల్ రాజు కుటుంబం నిర్మించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర ఆల‌యం పెళ్లి వేదిక‌గా ముస్తాబైన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే దిల్ రాజు కుటుంబ స‌భ్యులు నిజామాబాద్ కు చేరుకున్నారు. పెళ్లి కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రుగుతుందిట‌. ఈ పెళ్లికి ఆయ‌న స్నేహితులు గానీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వారుగానీ..ఇత‌రులు ఎవ‌రూ కూడా హాజ‌రు కాన‌ట్లు తెలిసింది.

కేవ‌లం కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలోనే నిరాడంబ‌రంగా తంతుని ముగిస్తున్నారు. అయితే స‌రిగ్గా లాక్ డౌన్ స‌మ‌యంలో రాజుగారు రెండ‌వ పెళ్లి అంత‌టా చ‌ర్చ‌కు దారి తీయ‌డం విశేషం. తెలంగాణ రాష్ర్ట ముఖ్య మంత్రి పెళ్లిళ్లు చేసుకోవాలంటే అమ్మాయి త‌రుపున 15 మంది…అబ్బాయి త‌రుపున 15 మందితో సింపుల్ గా కానిచ్చేయాల‌ని తెలిపారు. నిబంధ‌న‌లు మీర‌కుండా స‌దరు నిర్మాత అలాగే వివాహం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు వివాహం చేసుకునే వ‌ధువు వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దిల్ రాజు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్ నిర్మిస్తున్నారు. ఇది బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పింక్ కి రీమేక్ రూపం.