‘నీది నాదీ ఒకటే లోకం’ అంటున్న దిల్ రాజు

ఎఫ్ 2 విజయంతో మంచి జోరు మీదున్న దిల్ రాజు ఇప్పుడు ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం..మార్చి నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. ‘నీది నాదీ ఒకటే లోకం’ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణారెడ్డి అని తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా చేయనున్నారు. కృష్ణారెడ్డి గతంలో ఆడు మగాడ్రా బుజ్జి అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు.

రీసెంట్ గా కృష్ణారెడ్డి.. దిల్ రాజుకు ఓ కథ చెప్పారట. ఆ కథ దిల్ రాజుకు నచ్చటంతో వెంటనే పట్టాలు ఎక్కిస్తున్నారని సమాచారం. ఈ కథతోనే రాజ్ తరుణ్‌తో సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు సుముఖంగా ఉన్నారట. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. అటు రాజ్ తరుణ్‌కు ఈ మధ్యకాలంలో సరైన హిట్టు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్‌లో మరో అవకాశం రావడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

అలాగే రాజ్ తరుణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో లవర్ అనే చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యింది. అయితే అందరూ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమా చెయ్యలేడు అనుకున్నారు. కానీ సినిమా ప్లాఫ్ అయినా దిల్ రాజు…రాజ్ తరుణ్ కు అవకాసమివ్వటం గొప్ప విషయంగాచెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలానే 96 రీమేక్ ని కూడా తెరకెక్కించనున్నాడు రాజు.