టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద మృతి సంచలనమైంది. షాద్నగర్ సమీపంలోని పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల విస్థీర్ణంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు ఈ శవాన్ని కొనుగొనడంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సదరు స్టార్ హీరో ఆ వ్యవసాయ క్షేత్రంలో పనుల నిమిత్తం కొందరు వ్యవసాయ నిపుణుల్ని పంపించినప్పుడు ఈ మృతికి సంబంధించిన సంగతి వెలుగు చూసిందని తెలుస్తోంది.
చనిపోయిన వ్యక్తి ఎవరు? అన్నది సస్పెన్స్ గా ఉంది. అది ఆత్మహత్యనా లేక ఎవరైనా చంపి వ్యవసాయ క్షేత్రంలోని గదిలో వేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై సదరు హీరో స్పందించలేదు. గ్రామస్తుల సమాచారం అందుకుని వచ్చిన పోలీసులు ఆ శవాన్ని అదే వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లోనూ అనుమానా స్పద మృతి ఇలానే సంచలనమైన సంగతి విదితమే.
టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్లు హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోని విలేజ్ లలో ఎకరాల విస్తీర్ణంలో భూములు కొనుక్కున్న సంగతి తెలిసిందే. వీటికి కాపలాదారు కం వ్యవసాయ దారల్ని నియమించుకుని సేంద్రియ పంటల్ని పండిస్తున్నారు. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోనే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కు వందల ఎకరాల పొలం ఉంది. ఈ పొలాల్లో అధునాతన పద్ధతుల్లో సేంద్రియ పంటలు పండిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులకు .. ఏపీకి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఔట్ స్కర్ట్స్ లో భారీగా వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో నిరంతరం వ్యవసాయం సాగుతూ ఉంటుంది. నగరంలో సేంద్రియ ఫలసాయాన్ని అమ్మేది మెజరిటీ భాగం ఈ ప్రముఖులేనన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.