ఆర్. నారాయణ మూర్తి అంటే చిరుకు అంత అభిమానమా?

చిరంజీవి తన ఈవెంట్స్ కు చీఫ్ గెస్ట్ గా తీసుకుని రావాలని చాలా మంది సినిమావాళ్ల కోరిక. అయితే అందిరికీ అది తీరదు. ఆయన కొన్ని ఎంపిక చేసిన ఈవెంట్స్ కు మాత్రమే హాజరు అవుతారు. ఇప్పుడు అలాగే ఆర్. నారాయణ మూర్తి కోసం చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

పీపుల్స్‌స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. స్నేహ చిత్ర పతాకం పై రూపొందింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మంగళవారం ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెప్పే చిత్రమిది.

నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘ఓటు విలువను తెలియజేసే చిత్రం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బ్రహ్మాస్త్రం. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేేస కథ, కథనాలతో ఈ సినిమా చేశా. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ఇందులో చూపించాం. షూటింగ్‌ పూర్తయింది. రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేసి, మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

ఎల్‌.బి. శ్రీరామ్‌, కాశీ విశ్వనాథ్‌, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఆర్‌. నారాయణమూర్తి, జలదంకి సుధాకర్‌, పాటలు: గద్దర్‌, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, గవిగంటి రాజలింగం, కెమెరా: శ్రీనివాస్‌, ఎడిటింగ్‌: రామారావు.