చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ చారిటీకి ప‌లువురు స్టార్లు విరివిగా విరాళాలు ఇచ్చారు. తాజాగా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 1.25 కోట్ల‌ను విరాళంగా సాయ‌మందించారు.

ఈ సాయానికి మెగాస్టార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. “థాంక్యూ డియ‌ర్ బ్ర‌ద‌ర్.. బాల‌య్య‌.. 25ల‌క్ష‌లు క‌రోనా క్రైసిస్ చారిటీ కి 50ల‌క్ష‌లు చొప్పున ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు సాయం అందించారు ఎన్బీకే. అవ‌స‌రార్థం సాయానికి మీరెప్పుడు ముందుంటార‌ని నిరూపించారు. ప్రతిసారీ కష్ట సమయంలోను, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు తోడుంటారు“ అంటూ చిరు ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే చారిటీ కోసం సాయం చేసినా ఇలా చిరంజీవి సార‌థ్యం వ‌హించే సీసీసీకి బాల‌య్య సాయం చేయ‌డంపై అభిమానుల్లో ర‌క‌ర‌కాల సెటైర్లు ప‌డుతున్నాయి. అసంబద్ధ‌మే అయినా కొంద‌రు ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా కామెంట్లు చూస్తే.. ఈ ఫండ్ ని స‌రిగా పంచ‌క‌పోతే సింహా ఫైరింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది అన్న అర్థంలో