బోయపాటి వివాదం: సీన్ లోకి అల్లు అరవింద్

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు న్యాయం చేయటానికి రామ్ చరణ్ ప్రతిపాదించిన సెటిల్మెంట్ కు బోయపాటి ఇష్టపడలేదు. అంతేకాకుండా దానయ్య ని మొత్తం బిజినెస్ లెక్కలు చూపించమన్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తననే బ్లేమ్ చేస్తున్నట్లుగా అభిమానులకు ఉత్తరం రాయటమేంటని ఆవేదన చెంది, దానయ్యను నిలదీసారు. ఈ నేపధ్యంలో వివాదం పెరిగి పెద్దదవుతోందని భావించి చిరంజీవి, అల్లు అరవింద్ సీన్ లోకి వచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి..రామ్ చరణ్ ని ఉద్దేశించి …ఫిల్మ్ బిజినెస్ లోకి ఓ నటుడు ఇన్వాల్వ్ అవ్వటం తప్పు పట్టారని తెలుస్తోంది. రామ్ చరణ్ స్వయంగా బిజినెస్ డీల్ ని తన స్నేహితుడు యువి క్రియేషన్ కు అప్ప చెప్పారు. దాంతో ఇప్పుడు కాంపన్షేషన్ ని చెల్లించటానికి ఒప్పించాల్సి వస్తోంది. దాంతో చిరంజీవి అది రామ్ చరణ్ కు అనవసరమైన విషయమని అని చెప్పి, ఈ సెటిల్మెంట్ చేయటానికి అల్లు అరవింద్ ని రంగంలోకి దించారు.

అల్లు అరవింద్ కు బోయపాటి శ్రీను కు మంచి రాపో ఉంది. గతంలో అల్లు అరవింద్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా సరైనోడు చిత్రం తో సూపర్ హిట్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు బోయపాటిని ఐదు కోట్లు వెనక్కి ఇవ్వటానికి ఒప్పించటానికి అల్లు అరవింద్ సరైన వ్యక్తి అని భావించి చిరు ఆయన్ను పంపారని తెలుస్తోంది. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ పై బోయపాటి శ్రీను మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ చెప్పిన మాట వింటారని చిరంజీవి భావిస్తున్నారు.