చిరంజీవి వాట్సప్ స్క్రీన్ షాట్ పెట్టి మరీ…

మెగా స్టార్ చిరంజీవి మెచ్చుకోవటం అంటే ఎవరికైనా పట్టలేనంత ఆనందమే. ఇప్పుడు నిఖిల్ పరిస్దితి అదే. అతని తాజా చిత్రం టీజర్ ని చిరు చూసి మెచ్చుకుని చిత్ర నిర్మాతకు వాట్సప్ మెసేజ్ పెట్టారు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. చిరంజీవి వాట్సప్ ద్వారా వచ్చిన స్రీన్ షాట్ ని షేర్ చేసాడు. దాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు.

విభిన్నమైన కాన్సెప్ట్ లతో వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నిఖిల్‌.. కిరాక్‌ పార్టీ కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఎలాగైనా ష్యూర్ హిట్ కొట్టాలని తమిళ్‌ హిట్‌ మూవీ కణితణ్‌ రీమేక్‌ కు ఫిక్స్ అయ్యార. ‘అర్జున్‌ సురవరం’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌తో అంచనాలు క్రియేట్‌ చేసింది. ఈ నేఫధ్యంలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

ఒక అబద్దాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ ఒక నిజాన్ని నిజం అని​ ఫ్రూవ్‌ చేయడం చాలా కష్టం’.. ‘జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌’..‘వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సినవాడు తెలియట్లేదు..’ లాంటి డైలాగులతో ఆసక్తిగా ఉన్న టీజర్‌ ఆకట్టుకునేలానే ఉంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఠాగుర్‌ మధు నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.