“సైమా ” అవార్డుల్లో ఉత్తములెవరో ?

“సైమా ” అవార్డుల్లో ఉత్తములెవరో ?

ప్రతి సంవత్సరం కలర్ ఫుల్ గా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , అదే సైమా సినిమా అవార్డుల కార్యక్రమం ఈనెల 15 ,16 తేదీల్లో ఖతార్ లోని దోహా లో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి . తెలుగు , తమిళ, కన్నడ , మలయాళ చిత్రాల నుంచి ఎంపిక చేసిన నటీనటులు , చిత్రాలను ఈ అవార్డులలో ప్రదానం చేస్తారు . అందుకే వీటిని సైమా అవార్డులు అంటున్నారు . ఈ అవార్డుల కోసం నటి నటులు ఎదురు చూస్తూంటారని చెప్పవచ్చు. అంత గ్రాండ్ గా సైమా అవార్డులను నిర్వహిస్తారు

అయితే ఈ సంవత్సరం దోహాల జరిగే అవార్డుల కార్యక్రంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు . అదేరోజు . తెలుగు , కన్నడ సినిమా అవార్డులు ఉంటాయి . ఇక 16వ తేదీన తమిళ, మలయాళ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది .దీనికి ముఖ్య అతిధిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హాజరవుతున్నారు . ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా దక్షిణాది భాషల్లో ప్రముఖులను సత్కరిస్తారు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ చిత్రాలలో ఉత్తములైన వారి కేటగిరి నుంచి కొందరిని ఎంపిక చేసి ప్రకటించారు . అందులో నుంచి అవార్డుల ప్రదానం రోజు ఉత్తములను ప్రకటిస్తారు 

ఈ సంవత్సరం ఉత్తమ నటుడు కేటగిరిలో మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , విజయ్ దేవరకొండ , సుధీర్ బాబు , దుల్కర్ సల్మాన్ పోటీపడుతున్నారు . నటీమణుల్లో అనుష్క , అతిధి రావు , కీర్తి సురేష్ , సమంత , రష్మిక మందన్న పోటీలో వున్నారు . ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో భరత్ అనే నేను , గీత గోవిందం , అరవింద సామెత వీర రాఘవ , రంగస్థలం , మహానటి వున్నాయి. దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , సుకుమార్ , ఇంద్రగంటి మోహన్ కృష్ణ , నాగ్ అశ్విన్ , పరశురామ్ వున్నారు .
.