రామ్ చరణ్ అప్పుడెందుకు లెటర్ రాయలేదు?:బోయపాటి

వినయ విధేయరామ చిత్రం ఫ్లాఫ్ ని ఒప్పుకుంటూ రామ్ చరణ్ పంపిన లెటర్ అభిమానులను సంతృప్తి పరిచిందేమో కానీ దర్శకుడు బోయపాటి శ్రీను ని మాత్రం కోపం తెప్పించింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు …గతంలో రామ్ చరణ్ కు ప్లాఫ్ లు వచ్చినప్పుడు ఎందుకు అభిమానులకు లెటర్స్ పంపలేదని నిలదీసినట్లు తెలుస్తోంది.

“రామ్ చరణ్ కు గతంలో బ్రూస్ లీ, తుఫాన్ వంటి పెద్ద డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. కానీ అప్పుడు ఇలాంటి లెటర్స్ ఏమీ ఫ్యాన్స్ ని ఉద్దేశించి రాయలేదు. ఇప్పుడే ఎందుకు రాసారు.. మీ కొన్ని హిట్ సినిమాల కలెక్షన్స్ కన్నా నా ఫ్లాఫ్ కు ఎక్కువ రెవిన్యూ వచ్చింది ,” అని దానయ్యను నిలదీసినట్లు సమాచారం.

బ్రూస్ లీ సినిమా రామ్ చరణ్, దానయ్య కాంబినేషన్ లో రావటం, ఆ సినిమా వినయ విధేయరామ చిత్రం కన్నా పెద్ద డిజాస్టర్ కావటం జరిగింది. వినయ విధేయరామ చిత్రం 90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే…62 కోట్లు వెనక్కి వచ్చింది. 30 కోట్లు పోయింది. అదే బ్రూస్ లీ చిత్రం విషయానికి వస్తే..పెట్టుబడిలో ముప్పై శాతం కూడా రికవరీ కాలేదు. అవన్నీ బోయపాటి శ్రీను..దానయ్యకు గుర్తు చేసి, తనని డబ్బు వెనక్కి ఇవ్వమనే విషయమై వాదిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.